సిరాన్యూస్,చిగురుమామిడి
విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించాలి: డీఈఓ జనార్దన్ రావు
విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించాలని అందుకు అధ్యాపకులు నిత్యం కృషి చేయాలని జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు అన్నారు.మంగళవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని నవాబ్ పేట గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. వారు మాట్లాడుతూ తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో పట్టు సాధించాలన్నారు.హాజరు శాతం పెంచే విధంగా కృషి చేయాలన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.