సిరాన్యూస్, చిగురుమామిడి
పాఠశాల పనులు పూర్తి చేయడం అభినందనీయం: డీఈఓ జనార్దన్ రావు
* క్రీడా సామాగ్రి అందజేత
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను పూర్తి చేయడమే లక్ష్యంగా ఏర్పాటైన అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో వారికి ఇచ్చిన పనులను మండలంలోని మొదటిసారిగా పూర్తి చేయడం అభినందనీయమని జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబ్ పేట గ్రామంలోని బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాల పనులను మండలంలోని మొట్టమొదటిసారిగా పూర్తి చేశారు. వారిని విద్యాధికారి అభినందించి వారికి క్రీడ సామగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యా యులు మంగ, ఆదర్శ కమిటీ అధ్యక్షురాలు, ఉపాధ్యాయులు రాజయ్య సునీత పాల్గొన్నారు.