సిరా న్యూస్,హైదరాబాద్;
ప్రజావాణిలో కావాల్సిన మౌలిక సౌకర్యాలు… దూర ప్రాంతాలనుంచి వచ్చే ఫిర్యాదుదారులకు ఇబ్బంది లేకుండా చేపట్టాల్సిన చర్యలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు, శాశ్వత పద్ధతిన కొనుగోలు చేయాల్సిన వస్తు సామాగ్రి, రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకొని ఫిర్యాదుదారులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్న ఏర్పాట్లు తదితర వివరాలను ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ డిప్యూటీ సీఎంకు వివరించారు.