సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం మామునూరు గ్రామంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మిషన్ భగీరథ పై సమీక్ష చేసారు. సమీక్ష సమావేశానికి జిల్లా కలెక్టర్ గౌతం, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఇతర అధికారులు హజరయ్యారు.
మిషన్ భగీరథ సీ.ఈ కే శ్రీనివాస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మిషన్ భగీరథ పథకం గురించి వివరించారు.
మిషన్ భగీరథ పైప్ లైన్ వేసే క్రమంలో రోడ్లను తవ్వి వదిలేయడం వల్ల ఏర్పడిన గుంతలతో ప్రమాదాలు జరుగుతున్నందున వాటికి వెంటనే మరమ్మతులు చేయించాలని భట్టి ఆదేశించారు.
మిగిలిపోయిన మిషన్ భగీరథ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మధిర నియోజకవర్గంలోని కట్టలేరు ప్రాజెక్టు లెఫ్ట్, రైట్ కెనాల్ పూర్తి చేయడానికి కావలసిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశించారు. జాలిముడి ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా, మేయింటేనెన్స్ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ బిల్లులు నిలిపివేసి, బ్లాక్ లిస్టులో పెట్టాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు.