సిరాన్యూస్, భీమదేవరపల్లి
పంటలపై రైతుల అవగాహన
* పలువురు రైతులకు ఘన సన్మానం
భీమదేవరపల్లి మండలంలోని మల్లారం గ్రామంలో దేశ్ పాండే ఫౌండేషన్ ద్వారా రైతుల అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పత్తి రైతులకు, పత్తి పంట పండించడంపై, ఎరువుల వాడకం, అధిక దిగుబడి ఇచ్చే విత్తనాల సేకరణ గురించి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మల్లారం గ్రామంలో పత్తి పంట రైతులను డ్యాగల ఉప్పలయ్య, డ్యాగల వెంకటయ్యను, శాలువాతో సత్కరించి, గోడ గడియారం అందించారు.ఈ కార్యక్రమంలో దేశ్ పాండే ఫౌండేషన్ అధికారులు, గ్రామస్తులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.