Devanna Olapower: ఆత్రం సక్కును అత్యధిక మెజార్టీతో గెలిపించాలి : మాజీ సర్పంచ్ దేవన్న ఓలపవర్

సిరాన్యూస్, బేల‌
ఆత్రం సక్కును అత్యధిక మెజార్టీతో గెలిపించాలి : మాజీ సర్పంచ్ దేవన్న ఓలపవర్
బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పాఠన్ లో ప్రచారం

అదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సక్కును మెజార్టీతో గెలిపించాలని మాజీ సర్పంచ్ దేవన్న ఓలపవర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలో పాఠన్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు జోరుగా ప్రచారంలో కొనసాగిస్తున్నారు. బుధ‌వారం గడప గడప తిరుగుతూ ఎండ వాన అనక అదిలాబాద్ గడ్డ మీద బిఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా మాజీ సర్పంచ్ దేవన్న ఓలపవర్ ప్ర‌చారం చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ 10 ఏళ్ళ నుండి బీజేపీ పార్టీ ప్రజల్లో మత ద్వేషాలు అల్లకల్లోలం చేస్తూ, ధరలు పెంచి మధ్య తరగతి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడింద‌న్నారు. దేవుళ్ళ పేర్లతో రాజకీయం చేయడమే బిజెపి పార్టీకి తెలుసు అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మాయ మాటలు చెప్పి అబద్ధాలతో గెలిచిందన్నారు .6 గ్యారంటీ ల పేర్లతో ప్రజలకు ఏ ఒక్క హామీ నెరవేరకుండా మోసం చేసిందన్నారు.ఈ రెండు పార్టీలకు ప్రజలే ఓటుతోనే బుద్ధి చెప్పాలని కోరారు. బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరంగా వివరిస్తూ తెలంగాణలో కులం మతం తేడా లేకుండా అన్ని వర్గాల వారికి సమానంగా అభివృద్ధి హక్కులు కల్పించిన ఏకైక బిఆర్ఎస్ పార్టీ అని తెలిపారు.. మాజీ మంత్రి ఎమ్మెల్యే జోగు రామన్న చేసిన కృషి మరవద్దు అని వివరించారు. ఈ ప్రచారంలో సతీష్ పవార్, ప్రమోద్ రెడ్డి, మంగేష్ ఠాక్రే, మనోజ్ గేడాం, అరుణ్ కొడాపే, సుదర్శన్ ఠాక్రే, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *