బేల, సిరా న్యూస్
ముగిసిన కబడ్డీ క్రీడా పోటీలు
గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
పల్లెటూళ్లు ప్రగతికి పట్టుకొమ్మలని మహాత్మా గాంధీ మాటలను గుర్తుచేసుకొని గ్రామీణ స్థాయిలోని యువత క్రీడల్లో రాణించి గ్రామానికి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని కాంగ్రెస్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ రాందాస్ నాక్లే, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్ పూర్ గ్రామంలో కుమురం భీమ్, కుమురం భీం సురు యూత్ క్రీడా మండల్ ఆధ్వర్యంలో కబడ్డీ క్రీడా పోటీలు గత ఐదు రోజులుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన చివరి ఫైనల్ క్రీడా పోటీల్లో గాదిగూడ మండలం చిత్తగూడ కు చెందిన కబడ్డీ జట్టు మొదటి బహుమతి గెలుచుకోగా మహారాష్ట్రలోని సోనీపోడ్ గ్రామానికి చెందిన కబడ్డీ క్రీడాకారులు రెండవ బహుమతి సాధించారు. మూడవ స్థానంలో సదల్ పూర్ నిలిచింది. కాడ్కి గ్రామ కబడ్డీ జట్టు నాలుగో స్థానంలో నిలిచి బహుమతులు అందుకున్నారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే గ్రామ స్వరాజ్యం ఏర్పడుతుందన్న గాంధీజీ మాటలను గుర్తించుకొని గ్రామస్థాయిలో ఇలాంటి క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు.