కాంగ్రెస్ హయాంలో గ్రామాల అభివృద్ధికి పెద్దపీట

– ఎంపిపి ఆరెల్లి దేవక్కకొమురయ్య గౌడ్

సిరా న్యూస్,కమాన్ పూర్;
(రామగిరి మండలం)
అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎంపిపి అరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని లోంకకేసారం గ్రామంలో 28 లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణానికి ఎంపిటిసి కొట్టే సందీప్, మాజీ సర్పంచ్ ఎండి మంజూరు లతో కలిసి ఎంపిపి భూమి పూజ చేశారు* . అనంతరం ఎంపిపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పెద్దపీట వేసినట్లు తెలిపారు. మంథని నియోజకవర్గం అభివృద్ధికి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఎంతగానో కృషి చేస్తున్నారని, అన్ని గ్రామాల అభివృద్ధి కి కట్టుబడి ఉన్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని, గత ప్రభుత్వాలు హామీ లకే పరిమితమయ్యాయని , ఇచ్చిన పనులను అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందారని అన్నారు. గ్రామాలలో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేసేందుకు రాష్ట ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారనీ తెలిపారు .తమ పార్టీ నాయకులను విమర్శించడం మాని ప్రజలకు సంక్షేమ పథకాలను మంజూరు చేయడానికి కృషి చేయాలని బీఅర్ఎస్ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు వీరవేని శ్రీనివాస్,ఎం.డి.సలీం,పిట్టల సదానందం, నామనిరామ్మూర్తి, బోయని కొమురయ్య, రంగు శంకరయ్య, నామిని మహేష్, బోయిని శ్రీధర్, బండి శంకర్, అగ్గి ఓదెలు, బొయిని చంద్రయ్య బుర్ల రాజయ్య ఇరుగురాల సతీష్ రమేష్ సది, ఈర్ల అంజి, రాజయ్య, కొమురయ్య, వేముల సంపత్ , ఈర్లా సతీష్,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *