సిరా న్యూస్,జగిత్యాల;
నవ నరసింహ క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నరసింహ స్వామి తెప్పోత్సవం డోలోత్సవం నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనానికి క్యూ లైన్ లో బారులు తీరారు.సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం నుంచే క్యూ లైన్ లో ఉండి స్వామి వారి దర్శనానికి పోటెత్తారు.