సిరా న్యూస్,మెదక్;
మెదక్ జిల్లాలోని ప్రముఖ ఏడు పాయల వనదుర్గ మాత అమ్మవారి ఆలయం వద్ద మాఘ అమావాస్య సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంజీరా నదిలో పుణ్యస్నానాలను భక్తులు ఆచరిస్తున్నారు. మరో వైపు అమ్మవారిని ప్రత్యేకంగా పూలతో అలంకరించారు అర్చకులు. అమ్మవారి దర్శనానికి గంటకి పైగా సమయం పడుతుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక నుంచి భక్తులు తరలి వస్తున్నారు.