సిరాన్యూస్, కుందుర్పి
కుందుర్పిలో అమిలినేని సురేంద్ర బాబు రోడ్ షో : ధనుంజయ
కళ్యాణదుర్గం నియోజకవర్గం, మండల కేంద్రమైన కుందుర్పిలో శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు స్థానిక రామస్వామి దేవాలయం నుండి కుందుర్పి ఋషి డిగ్రీ కళాశాల మైదానం వరకు టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు రోడ్ షో జరుగుతుందని కుందుర్పి మండల టీడీపీ అధ్యక్షులు జి. ధనుంజయ తెలిపారు. ఇందులో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్, కనకదాసు విగ్రహాలకు ఆయన పూలమాలలు సమర్పిస్తారని పేర్కొన్నారు. అనంతరం ఋషి డిగ్రీ కళాశాల కాంపౌండ్ లో కుందుర్పి మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. కుందుర్పి మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు విశేషంగా హాజరు కావాలని కోరారు.