Dharani: ధరణి స్పెషల్ డ్రైవ్

సిరా న్యూస్, పెంబి
ధరణి స్పెషల్ డ్రైవ్
* పెండింగ్ లో 15 దరఖాస్తులు
* పెంబి తహసిల్దార్ లక్ష్మణ్
పెండింగ్ లో ఉన్న ధరణి పోర్టల్, ఫీల్డ్ వెరిఫికేషన్ పై శుక్రవారం నుండి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా శుక్రవారం నిర్మ‌ల్ జిల్లా పెంబి మండలంలో తహసీల్దార్ లక్ష్మణ్, డి టీ లచ్చన్న ఆధ్వర్యంలో  రెండు టీంలుగా ఏర్ప‌డ్డారు. పెంబి, పస్పుల తదితర గ్రామాలలో పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్థులను పరిశీలించారు. ఈనెల‌ 1 నుంచి 9వ తేదీ వ‌ర‌కు ధరణి స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని తహసీల్దార్ లక్ష్మణ్ తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎంపీవో రత్నాకర్ రావు, ఆర్ ఐ శ్రవణ్ రెడ్డి, శత్రుగన్, రాజ్యం, పుండాలిక్,అశోక్, శేఖర్, శ్రీను, స్వామి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *