సిరా న్యూస్, హైదరబాద్:
ధరణి స్థానంలో ‘భూ భారతి’
+ కసరత్తు ప్రారంభించిన రేవంత్ సర్కార్
+ పాత ఆర్వోఆర్ చట్టం రద్దు దిశగా అడుగులు
+ కొత్త చట్టంతో పాటు అత్యాధునిక సాఫ్ట్వేర్ రూపకల్పనకు యోచన
ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు పాత ధరణి పోర్టల్ స్థానంలో కొత్తగా ‘భూ భారతి‘ని తీసుకొచ్చే ఆలోచనలో రేవంత్ సర్కార్ ముందడు వేస్తోంది. రైతుల భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే లక్షల్లో భూ సమస్యలను ప్రభుత్వం ఇప్పటికే పరిష్కరించింది. అయితే సంకేతిక కారణాల చేత మరిన్ని దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. దీంతో పాత ఆర్వోఆర్ చట్టాని రద్దు చేసి, కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు సర్కార్ యోచిస్తోంది. దీంతో పాటు ఎలాంటి చిక్కులు లేని అధునాతన సాఫ్ట్వేర్ను సైతం రూపొందించనున్నట్లు సమాచారం. ఇదే కాకుండా రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఉన్న అన్ని భూ చట్టాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీంతో ఏళ్లుగా ధరణితో ఇబ్బందులు పడుతున్న రైతులు కొత్త చట్టం, కొత్త సాఫ్ట్ వేర్ ఎప్పుడెప్పుడా అంటూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ధరణి స్థానంలో భూ భారతిని తీసుకొచ్చి తమ కష్టాలు తీర్చాలని వేడుకుంటున్నారు.