సిరాన్యూస్,చిగురుమామిడి
రోడ్డు పనులు పూర్తి చేయాలని వరి నాట్లు వేసి నిరసన
ధర్మసమాజ్ పార్టీ మండల నాయకుడు పైస రాజ్ కుమార్
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామానికి చెందిన ధర్మసమాజ్ పార్టీ మండల నాయకుడు పైస రాజ్ కుమార్ అనే యువకుడు రామంచ- ముల్కనూరు రోడ్డు పూర్తి కాకపోవడంతో నిరసనగా శనివారం రోడ్డుపైన వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ కొన్ని ఏళ్ళ నుండి రామంచ- ముల్కనూరు రోడ్డు పూర్తి కాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి వెళ్ళడానికి నిత్యం గ్రామం నుండి అనేకమంది ప్రయాణిస్తుంటారని , ఈ గుంతల మయమైన రోడ్డు ద్వారా ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు.ప్రస్తుత వర్షాకాలం ప్రయాణించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేవారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.