కాణిపాకంలో ఉభయదారుల ధర్నా

సిరా న్యూస్,చిత్తూరు;
కాణిపాకం దేవస్థానం కార్య నిర్వాహణాధికారి కార్యాలయం ముందు కాణిపాకం ఉభయదారులు ధర్నాకు దిగారు. . కాణిపాకం కార్యక్రమాల్లో ఉభయ దార్లకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్న ఆలయ ఈవో, చైర్మన్ పై ఉభయ దారులు మండి పడుతున్నారు.ఆదివారం నాడు ఆలయ చైర్మన్, ఈవో కాణిపాకం చరిత్ర గ్రంథమును ముఖ్యమంత్రి జగన్ దగ్గర ఆవిష్కరించడంతో ఉభయ దారులు మండిపడ్డారు. . ఆ గ్రంథంలో ఉభయదారుల ప్రస్థానం లేదని ఆరోపించారు. కాణిపాకం ఇంత అభివృద్ధి చెందిందంటే మా కృషి ఉంది. ఉభయ దారులు ఉనికి లేకుండా చేస్తున్న ఈవో ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఈవో క్షమాపణ చెప్పి వెంటనే బదిలీ చేయాలని డిమాండ్లు చేసారు. అంతవరకు ధర్నా విరమించింది లేదని నిరసనకారులు భీష్మించి కూర్చున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *