సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ముందు అవుట్ సోర్సింగ్ సిబ్బంది ధర్నాకు దిగారు. ఉదయం ఏడున్నర నుండి 240 మంది కార్మికులు ధర్నాకు దిగారు. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని వారు ఆరోపించారు. చైతన్య జ్యోతి వెల్పేర్ సొసైటీ కాంట్రాక్టర్ కింద ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది పని చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు కోటిన్నర పైగా జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం, కాంట్రాక్టర్ తమను ఇబ్బంది పెడుతుందని మండిపడుతన్నారు.