సిరా న్యూస్,మేడ్చల్;
అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న శ్రీ చైతన్య స్కూల్ ముందు బడ్జెట్ పాఠశాల యాజమాన్యాలు ధర్నా కు దిగాయి. కుత్బుల్లాపూర్ మండలం సుచిత్ర మూడు గుళ్ళు ఎదురుగా శ్రీ చైతన్య పాఠశాల కు అనుమతులు లేకపోవడంతో మే నెలలో విద్యాశాఖ అధికారులు సీజ్ చేసారు. అయినా పాఠశాల యాజమాన్యం అడ్మిషన్ లు చేస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి.