సిరా న్యూస్,కాకినాడ;
వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ శుక్రవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కాకినాడ నగరంలోని పలుడివిజన్లకు చెందిన వాలంటీర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ తమకు రాజీనామా చేయడం ఇష్టం లేకున్నా వైకాపా నేతలు, కార్యకర్తలు చెప్పిన మాటలతో తాము రాజీనామా చేసామే తప్పా మనస్ఫూర్తిగా చేయలేదని వాపోయారు తాము కోవిడ్ సమయంలో కుటుంబాన్ని వదిలేసి ప్రజలకు పలు సేవలు అందించామని అటువంటి తమను వైకాపాకు చెందిన పలువురు నేతలు కార్యకర్తలు తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని మీరు రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో తప్పని పరిస్థితుల్లో రాజీనామాలు సమర్పించామన్నారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన నాయకుల ఎవరూ కూడా తమకు ధైర్యం చెప్పకపోగా పట్టించుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల పాటు సేవలందించి తమను తిరిగి విధుల్లోకి తీసుకొని తమ కుటుంబాలను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు…