రాయదుర్గంలో వైసీపీలో రోడ్డెక్కిన విభేదాలు

వ్యక్తిగత దూషణలు… చెప్పులతో కొట్టుకునే వరకూ వ్యవహారం

సిరా న్యూస్,అనంతపురం;
రాయదుర్గంలో వైసీపీ విభేదాలు రోడ్డెక్కాయి. సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు… చెప్పులతో కొట్టుకునే వరకూ వ్యవహారం వచ్చింది. ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు బోర్ వెల్ నాగిరెడ్డిపై చెప్పులతో దాడి చేయడం జరిగింది. కనేకల్ రోడ్డులోని ఓ హోటల్ వద్ద ఉన్న బోర్ వెల్ నాగిరెడ్డి పై ఒక్కసారిగా రామచంద్రారెడ్డి సోదరుడి భార్య మంజుల చెప్పుతో దాడి చేసింది. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రామచంద్రారెడ్డి వరుసకు సోదరుడు అయ్యే హంపారెడ్డిపై వాట్సాప్‌లో బోర్‌వెల్ నాగిరెడ్డి వ్యక్తిగత దూషణలు చేశాడు. ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డికి సపోర్ట్ చేస్తున్నారంటూ హంపారెడ్డిపై వ్యక్తిగత దూషణ చేస్తూ సామాజిక మధ్యమాల్లో బోర్‌వెల్ నాగిరెడ్డి పోస్టులు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాగిరెడ్డిపై పోలీసులకు హంపారెడ్డి భార్య మంజుల ఫిర్యాదు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *