సిరా న్యూస్,మంథని;
పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజపై అవిశ్వాసానికి రంగం సిద్ధం అయింది. మొత్తం13 మంది కౌన్సిలర్లలో 11 మంది బీఆర్ఎస్, ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్స్ వున్నారు. బీఆర్ఎస్ కు చెందిన ఏడుగురితో పాటు, కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు కౌన్సిలర్స్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానికి సిద్ధమైయారు. వీరంతా మంత్రి శ్రీధర్ బాబును హైదరాబాద్ లో కలిసినట్టు సమాచారం. అధికారులకు నోటీసులందించాక శిబిరానికి తరలివెళ్లేందుకు రంగం సిద్ధం అయింది..