సదాశివపేట మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం

సిరా న్యూస్,సంగారెడ్డి;
సదాశివపేట మునిసిపాలిటీలో ఆవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్ పర్సన్ జయమ్మకి వ్యతిరేకంగా 22 మంది కౌన్సిలర్లు ఓటు వేసారు. సదాశివపేట నూతన మున్సిపల్ చైర్ పర్సన్ గా బీఆర్ఎస్ కౌన్సిలర్ అపర్ణ శివరాజ్ పాటిల్ ని ఎన్నుకునే అవకాశం వుంది. మొత్తం 26 మంది సభ్యులలో అవిశ్వాసానికి అనుకూలంగా 22 మంది ఓటు వేసారు. నలుగురు కౌన్సిలర్లు హజరు కాలేదు. పార్టీలకు అతీతంగా అపర్ణ శివరాజ్ పాటిల్ కే కౌన్సిలర్లు మద్దతు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *