ఇంజక్షన్లు వికటించి రోగులకు అస్వస్థత

సిరా న్యూస్,అనకాపల్లి;
అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వా స్పత్రిలో ఇంజక్షన్లు వికటించి రోగు లు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఇంజక్షన్లు వేశారు. అయి తే ఏమైందో తెలియదు ఉన్నట్లుండి ఇంజక్షన్లు తీసుకున్న వారికి ఊపిరి అందక తీవ్ర ఇబ్బంది పడ్డారు. పరిస్థితిని గమనించిన వైద్యులు వైద్యం అందించినా ఫలితం లేకపో వడంతో పోలీసులకు సమాచారమి చ్చారు. విషయం తెలుసుకున్న హోంమంత్రి అనిత కలెక్టర్తో మాట్లా డి హుటాహుటిన అంబులెన్సులు పంపించారు. మెరుగైన చికిత్స కోసం బాధితులందర్నీ అనకాపల్లి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. 18 మంది రోగులు అస్వస్థతకు గురికాగా వీరిలో ఐదుగురు చిన్నారులున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *