సిరా న్యూస్,ఎమ్మిగనూరు;
పట్టణంలోని కేజీబీవీ 10 తరగతి విద్యార్థినులకు బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుట్టా ప్రతుల్ పుస్తకాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బుట్టా ప్రతుల్ మాట్లాడుతూ బుట్టా ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇప్పటికే చాలా చేశామని పేర్కొన్నారు. ముందు,ముందు పట్టణంలో కూడ సేవ కార్యక్రమాలు చేయడానికి ముందుంటామని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బుట్టా ఫౌండేషన్ మేనేజర్ చరిత, కేజీబీవీ ప్రిన్సిపల్ కవిత,పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.