పాల్గొన్న ఐటీ మంత్రి శ్రీధర్ బాబు
సిరా న్యూస్,హైదరాబాద్;
కూకట్ పల్లి పిఎన్ఎమ్ హై స్కూల్ లో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న 100 మంది పేద రైతు కుటుంబాలకు శనివారం రాష్ట్ర ఐ టీ మంత్రి శ్రీధర్ బాబు ఆర్ధిక సహాయం అందజేశారు…
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐ.టి మంత్రి శ్రీధర్ బాబు,కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ హజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేయ బొదని హామీ ఇచ్చారు. ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేస్తున్నామని,ప్రజల నుండి మంచి విశేష ఆదరణ కాంగ్రెస్ పార్టీకి వస్తుందని, బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కి ప్రజల నుండి వచ్చిన ఆదరణ చూసి తట్టుకోలేక పార్టీపై విష ప్రచారం చేస్తున్నారు అని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో ప్రజలందరూ సహకరించాలని, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే ప్రభుత్వ మా ప్రభుత్వం అని ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకి అందేలా చేస్తామని,పార్టీలకు అతీతంగా, పేద రైతులకు మేమున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూకట్పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్ మాట్లాడుతూ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికీ భయపడదని,బి ఆర్ ఎస్ నాయకులు చేసిన తప్పులను,కబ్జాలను వెలికి తీసి బయట పెడతామని, కూకట్పల్లి ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ధైర్యాన్నిస్తూ,బిఆర్ఎస్ నాయకులు చేసే దౌర్జన్యాలను అడ్డుకుంటుందని తెలిపారు.