సిరా న్యూస్,హైదరాబాద్;
బోనాల పండుగ సందర్భంగా మలక్ పేట నియోజకవర్గం పరిధిలోని అమ్మవారి ఆలయాలకు ఎం ల్ సి షాబీర్ అలీ,మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాల,సైదాబాద్ కార్పొరేటర్ కొత్త కాపు అరుణ రవీందర్ రెడ్డి మరియు ఎండోమెంట్ అధికారులతో ఆలయ కమిటీ నిర్వాహకులకు చెక్కులను అందజేశారు. బొగ్గులకుంట లోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 96 అమ్మవారి ఆలయాలకు ఎమ్మెల్యే బలాల రూ.4కోట్ల విలువ గలా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం బోనాల పండుగను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని ఆలయాలకు నిధులు మంజూరు చేయడం జరిగందన్నారు.మలక్ పేట నియోజక వర్గ ప్రజలంత భక్తి శ్రద్ధలతో బోనాల పండుగను జరుపుకోవాలని,భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ఆలయాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
====