సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా వైరాలో సీఎంఆర్ఎఫ్ చెక్ లు వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు.నియోజకవర్గంలోని 183 మంది లబ్ధిదారులకు ఎంపీ రామసహాయం. రఘురామిరెడ్డి , ఎమ్మెల్యే రాందాస్ నాయక్ చేతుల మీదగా అందించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం ఎంపీగా పోటీ చేసినప్పుడు వైరా నియోజకవర్గంలో ప్రజలు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నారు. వైరా నియోజకవలోని ప్రజలందరికీ రుణపడి ఉండి వాళ్ళ రుణం తీర్చుకుంటామన్నారు.నియోజకవర్గంలోని ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతుల పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందని అన్నారు. లక్షలు ఖర్చు చేసి కార్పొరేట్ వైద్యశాలల్లో చికిత్స చేయించుకోలేని వారికి సీఎంఆర్ఎఫ్ పథకం కొండంత అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్, వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్ జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు