పాల్గొన్న నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్
సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాల స్థానిక పార్క్ రోడ్డు లో గల బాల అకాడమీ మరియు రవీంద్ర విద్యాసంస్థలు అధినేత రవీంద్ర , మాధవిలత ఆధ్వర్యంలో స్థానిక ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరై వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలు వాడి మన పర్యావరణాన్ని మనమే పరిరక్షించుకోవాలని ముఖ్య ఉద్దేశంతో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు . మత సామరస్యానికి ప్రతీకగా వినాయక చవితి నిర్వహించుకుంటారని ప్రతి ఒక్కరూ వినాయక చవితి రోజు వినాయకుని పూజిస్తారని కావున దయచేసి అందరూ మట్టి వినాయకుని విగ్రహాలనే వాడాలని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో ఒకటవ పట్టణ సిఐ సుధాకర్ రెడ్డి , 6 వ వార్డు టిడిపి ఇన్చార్జి పల్లె వెంకటసుబ్బయ్య , మిద్దె చిన్న ఉసేని , బింగుమల్లె శ్యాంసుందర్ గుప్తా , గోవిందు తదితరులు పాల్గొన్నారు.
=======================