విత్తన దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్

సిరా న్యూస్,రాజన్న సిరిసిల్ల జిల్లా;
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పోత్తూరు నందు విత్తన దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి వడ్డేపల్లి భాస్కర్.ప్రస్తుత వానాకాలం సీజన్ కు సంబంధించి పత్తి మరియు ఇతర పంటల విత్తనాలు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.అదే విధంగా పత్తి విత్తనాలు అన్ని రకాల కంపెనీల నుంచి బోల్ గాడ్ 2 టెక్నాలజీ లోనే ఉత్పత్తి చేయబడుతాయి కాబట్టి రైతులు గమనించి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే రైతులు రెండు, మూడు రకాలైన హైబ్రిడ్ పత్తి రకాలను సాగు చేసుకోవాలని సూచించడమైనది.దిగుబడి అనేది వాతావరణ అనుకూలత మరియు నేల స్వభావాన్ని బట్టి ఉంటుంది.అన్ని రకాల బిజి 2 విత్తనాలు కాయ తొలుచు పురుగులను తట్టుకుంటాయి కాబట్టి ఈ విషయాన్ని రైతులు దృష్టిలో ఉంచుకొని పత్తి విత్తనాలు కొనుగోలు చేయవలసిందిగా సూచించారు.అదేవిధంగా ఎవరైనా నకిలీ పత్తి విత్తనాలు మరియు నాణ్యతలేని పత్తి విత్తనాలు అమ్మినట్లయితే వ్యవసాయ శాఖ దృష్టికి తీసుకురావాల్సిందిగా జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ తెలియచేయడం జరిగింది.ఈ తనిఖీ లో జిల్లా వ్యవసాయ అధికారితో పాటు మండల వ్యవసాయ అధికారి సురేష్ రెడ్డి కూడా పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *