సిరా న్యూస్,పెద్దపల్లి;
లోక్ సభ పోలింగ్ సందర్భంగా పెద్దపల్లి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ సామాన్యుడిలా క్యూ లైన్ లో నిలబడి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సోమవారం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో రంగంపల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం సంఖ్య 79 లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అనంతరం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల పోలింగ్ సజావుగాజరుగుతుందని, రంగంపల్లి పోలింగ్ కేంద్రంలో ఉన్న తన ఓటు హక్కును తాను బాధ్యతగా వచ్చి వినియోగించుకోవడం జరిగిందని తెలిపారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని , ప్రజలు తమకు అందించిన పోలింగ్ స్లిప్పులతో పాటు ఓటర్ ఐ.డి. కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకొని వచ్చి పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకో వాలని కలెక్టర్ సూచించారు. మనం వేసే ఓటే మన భవిష్యత్తును నిర్దేశిస్తుందని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికలో మనమంతా భాగస్వామ్యం కావాలని, ప్రతి ఒక్క ఓటరు ఓటు వేయాలని ప్రజాస్వామ్యాన్ని సంరక్షించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
============================