సిరా న్యూస్, ఆదిలాబాద్
జిల్లా అభివృద్ధిపై మోడీ స్పష్టత ఇవ్వాలి
* అదిలాబాద్ జిల్లా అభివృద్ధి సాధన సమితి నాయకులు
ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం ప్రధాని మోడీ స్పష్టత ఇవ్వాలని అదిలాబాద్ జిల్లా అభివృద్ధి సాధన సమితి నాయకులు అన్నారు. శుక్రవారం అదిలాబాద్ సుందరయ్య విజ్ఞాన భవనంలో అదిలాబాద్ జిల్లా అభివృద్ధి సాధన సమితి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గణపత్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా కన్వీనర్ కో కన్వీనర్ లు ముడుపు ప్రభాకర్ రెడ్డి, బండి దత్తాత్రే లు మాట్లాడారు. గతంలో బిజెపి ఇచ్చిన ఎన్నికల నెరవేర్చలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అమీషా వచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ వెంటనే తెరిపిస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు తెరిపించలేదన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ, అదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ ఏర్పాటు , టెక్స్టైల్ పార్క్, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటపై ఈనెల 4న అదిలాబాద్కు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేయాలని, శంకుస్థాపన చేసి నిధులు ఎన్నికల విడుదల చేయాలని కోరారు. సమావేశంలో కన్వీనర్ రోకల రమేష్, జగన్ , సభ్యులు కుమార్, సచిన్ డి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.