సిరా న్యూస్, ఆదిలాబాద్:
DISTRICT JUDGE: జిల్లా జడ్జిని కలిసిన రిమ్స్ ప్యానెల్ న్యాయవాది జొండలే అజయ్ కుమార్
ఇటీవల రిమ్స్ ప్యానల్ న్యాయవాది గా నియమితులైన జొండలే అజయ్ కుమార్, ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే. ప్రభాకర్ రావు ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సోమవారం ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తిని ఆయన చాంబర్లో ప్రత్యేకంగా కలిసి పుష్పగుచ్చం అందించి, ధన్యవాదాలు తెలిపారు. రిమ్స్ ప్యానెల్ న్యాయవాదిగా తన శక్తి సామర్థ్యాల మేరకు పనిచేస్తానని, బాధితులు, న్యాయ సలహాలు అవసరమైన నిరుపేదలకు నాణ్యమైన సేవలను అందించడానికి కృషి చేస్తానని అడ్వకేట్ అజయ్ న్యాయమూర్తికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు భగత్ మహేందర్, రాగం ప్రశాంత్, తదితరులు ఉన్నారు.