జిల్లా భూకబ్జాలపై విచారణ జరపాలి

అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకుల డిమాండ్

సిరా న్యూస్,బద్వేలు;

కడప జిల్లాలో గత పది సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూములను పాలకవర్గ పార్టీలు అయినా వైసీపీ టిడిపిలోని ప్రజాప్రతినిధుల బంధువులు రాజకీయ పలుకుబడి కలిగిన నాయకులు ఇతర ప్రాంతాల హైదరాబాద్ బెంగళూరు గుంటూరు కర్నూల్ ప్రకాశం తదితర జిల్లాలకు చెందిన డబ్బున్న వ్యక్తులు రెవెన్యూ ఉన్నతాధికారులు ప్రమేయంతో ప్రభుత్వ భూములు లక్షా 50 వేల ఎకరాలు జిల్లాలో అన్యక్రాంతమైన ఈ వాటిపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా భూపారాట సాధన కమిటీ కన్వీనర్ బి నారాయణ డిమాండ్ చేశారు ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా భూకబ్జాలపై విచారణ జరపాలని రౌండ్ టేబుల్ సమావేశానికి అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు అయినా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుబ్రహ్మణ్యం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తార్ బిఎస్పి పార్టీ జిల్లా నాయకులు గుర్రప్ప ముఖ్య ఉపన్యాసకులుగా మాట్లాడారు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్ అధ్యక్ష వహించారు జిల్లా భూపారాట సాధన కమిటీ జిల్లా కన్వీనర్ బి నారాయణ మాట్లాడుతూ వైసీపీ టిడిపి రెండు ప్రభుత్వాలు ఇప్పటికే పరిపాలించాయి వీరి పరిపాలనలో భూకబ్జాలు పెట్రేగిపోయాయని అన్నారు ఒంటిమిట్ట మండలం జోకుల పల్లె రెవెన్యూ పొలంలో 3000 ఎకరాలు పెన్నా పేరూరు రెవెన్యూ పొలం సర్వేనెంబర్ 661 లో వందల ఎకరాలు భూములు అన్య క్రాంతమైన అన్నారు సిద్ధవటం మండలం నాయకులు కడప ప్రజాప్రతినిధులు ఎస్టేట్లు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ భూములను అనుభవిస్తున్నారన్నారు కాశినాయన మండలం అక్కింగుండ్ల రెవెన్యూ పొలంలో 2017 సంవత్సరం అప్పటి కలెక్టర్ బాబూరావునాయుడు ఆదేశాల మేరకు 6 మంది తాసిల్దార్లు ఆర్డీవో విచారించిన భూములు ఇప్పటికీ స్వాధీనం చేసుకోలేదన్నారు బద్వేల్ గోపవరం రెండు మండలాలలో చాలా విలువైన ప్రభుత్వ భూములు 500 ఎకరాలు వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు పలుకుబడి కలిగిన వారు ఆక్రమించుకున్నారన్నారు వారి పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు బద్వేల్ దొంగ పట్టాలు సృష్టించే వారిపై కేసులు నమోదు చేశారు ఎఫ్ ఐ ఆర్ లో ప్రకటించిన వారందరిని అరెస్టు చేయకుండా ఒకరిద్దరిని మాత్రమే అరెస్టు చేసి తర్వాత పట్టించుకోలేదన్నారు జెడ్ హెచ్ డి సి సొసైటీ ద్వారా దళితులు బద్వేల్ గోపవరం అట్లూరు పోరుమామిళ్ల మైదుకూరు ఖాజీపేట మండలాలలో సాగు చేసుకుంటున్న భూములకు ఇప్పటికీ పట్టాలి ఇవ్వలేదు అన్నారు ప్రభుత్వపరంగా రైతు భరోసా సబ్సిడీలు పంట నష్టపరిహారం ఇన్సూరెన్స్ సౌకర్యాలు నోచుకోలేదన్నారు దళితులు సొసైటీ భూముల ద్వారా సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములను వైసీపీ ప్రభుత్వం ప్లే వుడ్ ఫ్యాక్టరీ యజమానులకు వందల ఎకరాలు అప్పజెప్పారు అదే విధంగా అన్నమయ్య డెవలప్మెంట్ అథారిటీ పేరుతో హెచ్ డి సి భూములు కూడా స్వాధీనం చేసుకున్నారు 30 ఏళ్ల నుంచి పంటలు వేసుకుంటూ అనుభవిస్తున్న దళిత కుటుంబాలను నేడు రోడ్లపాల్లో అయినారు సీకే దీన్నే మండలం కడప నగర పరిధిలో పుట్లంపల్లి రిమ్స్ పరిసర ప్రాంతాలు బుద్ధ టౌన్ షిప్ భావన టౌన్షిప్ తదితర ప్రభుత్వ భూములలో లేఅవుట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కార్పొరేషన్ పాలకవర్గ సభ్యులు రాజకీయ నాయకులు ఈ పని తప్ప ఇంకొకటి ప్రజా సమస్యలు పట్టడం లేదన్నారు రెవెన్యూ ఉన్నతాధికారులు ప్రమేయం కూడా స్పష్టంగా బయటపడి తాసిల్దార్లు వీఆర్వోలు సస్పెండ్ అయ్యారు తాసిల్దార్ లు కూడా కోట్ల రూపాయలు సొమ్ము తీసుకొని బదిలీలయ్యారు నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే టిడిపి మండల నాయకులు కూడా గ్రామాలలో మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి భూములు దున్నుకుంటామని బ్రహ్మంగారిమఠం బద్వేల్ మైదుకూరు ఒంటిమిట్ట తదితర మండలాలలో దౌర్జన్యం న్యాయానికి పాల్పడుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూకబ్జాలపై శ్వేత పత్రం విడుదల చేసి వదిలివేయటం కాదు కడప జిల్లాలో సమగ్ర విచారణ జరిపి భూకబ్జాదారుల పైన ల్యాండ్ గ్రాబింగ్ కేసులు నమోదు చేయాలన్నారు అదేవిధంగా భూ సీలింగ్ యాక్ట్ కూడా అమలు చేసినప్పుడే భూకబ్జాలను అరికట్టవచ్చునారు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు కు వలసలు నివారించాలన్న ఉపాధి కల్పించాలన్న ప్రతి కుటుంబానికి మూడు ఎకరాలు ప్రభుత్వ భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేనియెడల ప్రజలను చైతన్యవంతులను చేసే దానికి వెనుకాడమన్నారు అన్యక్రాంతమైన భూముల వివరాలు భూకబ్జా దార్ల పేర్లు తో కూడిన కరపత్రాలు వేస్తామన్నారు అదేవిధంగా భూ పోరాటాలు చేపట్టే విధంగా ప్రజలను చైతన్యవంతం చేసే దానికి ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు ఐక్యపరచాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అలీ ఖాన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ హేతువాద సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సి ఆర్ వి ప్రసాద్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దస్తగిరి రెడ్డి డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి మునయ్య దళిత ఫోరం జిల్లా నాయకులు కిషోర్ రాజేష్ రావు రిపబ్లిక్ పార్టీ నాయకులు నరసింహ లోక్సత్తా పార్టీ జిల్లా నాయకులు దేవర కృష్ణ జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు ఆంజనేయులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోనేటి నరసయ్య సహాయ కార్యదర్శి సురేష్ బాబు బి కే ఎం యు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాజు రసూల్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *