సిరా న్యూస్,కర్నూలు;
రాయలసీమ యూనివర్సీటిలో 3 బ్లాకులలో , 16 స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రత ను కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ బుధవారం పరిశీలించారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సిసి కెమెరాల కమాండ్ కంట్రోల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ
స్ట్రాంగ్ రూమ్ ల యొక్క మూడంచెల భద్రతలో మొదటి స్థాయిలో కేంద్ర సాయుధ బలగాలు, రెండవ స్ధాయిలో ఆర్మడు రిజర్వుడు బలగాలు , తృతీయ స్ధాయిలో సివిల్ పోలీసు బలగాలను మోహరింపచేశామన్నారు.
స్ట్రాంగ్ రూమ్ ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందనీ,
ప్రతి స్ట్రాంగ్ రూమ్ , పరిసరాలలో సిసిటివి కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచామనీ తెలిపారు.
ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో గస్తీ ఏర్పాటు చేశామనీ,
స్ట్రాంగ్ రూమ్ లకు ఉన్నత స్ధాయి అధికారులను ఇంచార్జీలుగా నియమించామన్నారు.
ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ ఇంజన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందనీ,
విద్యుత్ అంతరాయం లేకుండా జనరేటర్ లు కూడా ఏర్పాటు చేశామన్నారు.
ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పరిచిన కేంద్రాల ఎంట్రెన్స్ గేట్ లోపలికి , పరిసరాలలోకి గుర్తింపు కార్డులు లేని వ్యక్తులు లేదా అనధికార వ్యక్తులు , ఇతరుల వాహనాలకు అనుమతిలేదనీ,
రాజకీయ పార్టీల అభ్యర్థులు , వారి ఏజెంట్లు ఔటర్ పెరిమీటర్ వరకు మాత్రమే వెళ్ళాలన్నారు.
రాజకీయ పార్టీల అభ్యర్దులు, పుకార్లు, అపోహలను నమ్మవద్దనీ, తొందరపడకుండా నిర్ధారణకు అవసరమైతే ఎలక్షన్ కమిషన్ దృష్టి కి తీసుకువెళ్ళాలనీ సూచించారు.
అపోహలు, తప్పుడు సమాచారాలు నమ్మి జిల్లాలో ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే పోలీసు శాఖ తీవ్రంగా పరిగణించి అటువంటి వారి పై కఠిన చర్యలు తీసుకుంటామనీ,
• జూన్ 4 న ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్నారు. అసాంఘిక శక్తులు, రౌడీ షీటర్ల పై ప్రత్యేక పోలీసు నిఘా కొనసాగుతోందనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో
జిల్లా ఎస్పీ వెంట కర్నూలు డిఎస్పీ కె. విజయశేఖర్, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సిఐలు నాగరాజు యాదవ్, శ్రీనివాస రెడ్డి, కర్నూలు తాలుకా సిఐ శ్రీధర్, ట్రాఫిక్ సిఐ గౌతమి, ఆర్ ఐలు ఉన్నారు.