సిరా న్యూస్,మద్దికేర;
మండల కేంద్రమైన మద్దికేర గ్రామంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.సోమవారం సెక్రెడ్,మదర్ థెరిస్సా మండల వికలాంగుల సమాఖ్య ఆధ్వర్యంలో దివ్యాంగులంతా కలిసి గ్రామంలో ర్యాలీ చేసి,మానవహారం నిర్వహించారు.
అనంతరం కమ్యూనిటీ హాల్ లొ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా జడ్పీటిసి మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని,ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.వికలాంగుల సమాఖ్య పేరు మీద 5 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తామని యంపిపి అనిత శ్రీనివాసులు హామీ ఇచ్చారు.ఐకెపి ఎపిఎం మధుబాబు మాట్లాడుతూ ఐకెపి ద్వారా స్థిరమైన జీవనోపాధి కార్యక్రమాలు చేపడితే అలాంటి వారికి బ్యాంకు రుణాలు అందుబాటు చేయిస్తామని తెలిపారు. సెక్రెడ్ కోఆర్డినేటర్ శివశంకర్ మాట్లాడుతూ సెక్రెడ్ సంస్థ డైరెక్టర్ తిప్పన్న సహకారంతో ప్రస్తుతం కర్నూలు జిల్లాలో 21 మండలాల్లో 10 వేల మంది దివ్యాంగులతో 1050 సంఘాలు,21 మండల దివ్యాంగుల సమాఖ్యలను,3 జిల్లా స్థాయి సమాఖ్యలో ఏర్పాటు చేసి దివ్యాంగులు స్వతంత్రంగా తమంతట తాము జీవించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రంగస్వామి,ఈఓఆర్డీ శ్రీనివాసులు,రాజేశ్వరరెడ్డి,సర్పంచ్ రామాంజనేయులు,ఆర్ఎంపి ఆంజనేయులు,
సెక్రెడ్ సిబ్బంది వీరాంజనేయులు, హనుమంతప్ప,వీరేశమ్మ,వెంకటేష్ రవి నాయక్, రాజు,మస్తాన్ బీ,మదర్ థెరిస్సా సమాఖ్య సభ్యులు భాస్కర్,శ్రీరాములు,మల్లికార్జున నాగరాజు,శివ,చంద్ర ఆశాబి,శివమ్మ తదితురులు పాల్గొన్నారు.