డివైడర్ పైకెక్కిన ఆర్టీసీ బస్సు

ప్రయాణికులు సురక్షితం
సిరా న్యూస్,నిజామాబాద్;
నిజామాబాద్-2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆర్మూర్ నుంచి నిర్మల్ వైపు వెళ్తుండగా మెండోరా మండలం పోచంపాడ్ జాతీయ రహదారిలో ఒక్కసారిగా డివైడర్ ఎక్కింది. దీంతో బస్సులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *