సిరాన్యూస్, జైనథ్
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్ఓ నరేందర్
* బాలాపూర్ లో మెగా వైద్య శిబిరం
నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా డీఎంహెచ్ఓ నరేందర్ తెలిపారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని బాలాపూర్ గ్రామంలో మెగా వైద్య శిబిరాన్నినిర్వహించారు. ఈ శిబిరానికి డీఎంహెచ్ఓ నరేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ దోమలు దరిచేరకుండా దోమ నిరోధకాలు, దోమ తెరలు వాడాలని తెలిపారు. చిన్నపాటి జ్వరం వచ్చినా ఆసుప్రతికి వెళ్లి వెద్యులను సంప్రదించాలని కోరారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం రోగులకు రక్త పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జైనథ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నైనత, ల్యాబ్ టెక్నిషియన్, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు, రిమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.