సిరా న్యూస్, జైనథ్:
చిన్నారులకు పోలియో చుక్కలు తప్పనిసరి
5 సంవత్సరాల లోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జైనథ్ ఎంపిటిసి కొడిచర్ల సుదర్శన్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో జైనథ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ నైనతా, ఇతర సిబ్బందితో కలిసి పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చిన్నారులకు అంగవైకల్యం సోకకుండా ఉండాలంటే తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో చుక్కల గురించి అపోహలు వీడాలన్నరు. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకొని చిన్నారులకు సోమ, మంగళవారాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ చుక్కలు వేస్తారని అన్నారు. అనంతరం మెడికల్ ఆఫీసర్ నైనతా మాట్లాడుతూ… ఈ అవకాశాన్ని చిన్నారుల తల్లిదండ్రులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.