సిరాన్యూస్, ఇచ్చోడ
అనారోగ్యానికి గురైతే ఆయుర్వేద డాక్టర్ సంప్రదించండి: వైద్యాధికారి శ్రీకాంత్
* ఇచ్చోడలో ఉచిత ఆయుష్ ఆయుర్వేద వైద్య శిబిరం
ఎవరికైనా అనారోగ్యం సోకితే మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆయుష్ ఆయుర్వేద డాక్టర్ సంప్రదించాలని మండల వైద్యాధికారి శ్రీకాంత్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం ఎస్సీ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆయుష్ ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. బీపీ, షుగర్ కీళ్ల నొప్పులు తదితర వ్యాధులతో బాధపడుతున్న 140 మంది వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా ఆయుర్వేద మందులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ఆయుష్ డాక్టర్ పీతల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయుష్ మండల వైద్యాధికారి శ్రీకాంత్ మాట్లాడుతూ. ఎవరికైనా అనారోగ్యం సోకితే మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆయుష్ ఆయుర్వేద డాక్టర్ సంప్రదించి ఉచిత చికిత్స తో పాటు ఉచితంగా ఔషధాలు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.