Doctor Tharun : సీజ‌న‌ల్ వ్యాధుల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి  :మండల వైద్యాధికారి తరుణ్

సిరాన్యూస్‌, నాంపల్లి
సీజ‌న‌ల్ వ్యాధుల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి  :మండల వైద్యాధికారి తరుణ్
* మల్లపురాజుపల్లిలో వైద్య శిబిరం

సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి తరుణ్ అన్నారు. బుధ‌వారం నల్గొండ జిల్లా నాంపల్లి మండ‌లంలోని మల్లపురాజుపల్లిలో ప్రాధమిక ఆరోగ్యా కేంద్రం ఆధ్వ‌ర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈసంద‌ర్బంగా వైద్యాధికారి తరుణ్ మాట్లాడారు. ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల‌న్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఎలాంటి అనారోగ్య సమ స్యలు కనిపించిన వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకురావాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పసునూరి పల్లె దావఖన వైద్యులు డాక్టర్ దువ్వా నవీన్, గ్రామ‌ పంచాయతీ కార్య‌ద‌ర్శి ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *