ఒకరి రక్తదానం మరో ముగ్గురికి ప్రాణదానంతో సమానం

-6వ నగర పోలీస్ స్టేషన్ సిఐ వీరు నాయక్.
 సిరా న్యూస్,నెల్లూరు;
నేటి సమాజంలో రోజురోజుకీ పెరుగుతున్న రక్త నిల్వల అవసరం మేరకు ఒకరి రక్తదానం మరో ముగ్గురికి ప్రాణదానం అని నెల్లూరు నగరంలోని స్థానిక ఆరవ నగర పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ వీరు నాయక్ పేర్కొన్నారు. బంగారు భూమి డెవలపర్స్ చైర్మన్ రఘురాం తన జన్మదినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలోని స్థానిక అన్నపూర్ణ అపార్ట్మెంట్ ప్రాంతంలో తల సేమియా వ్యాధి బారిన పడిన చిన్నారుల కోసం రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో గురువారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిఐ వీరు నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు భూమి డెవలపర్స్ సంస్థలో పనిచేస్తున్న రాజా ,బాబులతో పాటు మార్కెటింగ్ సిబ్బంది కార్యాలయ సిబ్బంది మరియు సహచర సన్నిహితుల సంయుక్త సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరానికి నిర్వహించడం హర్షనీయం అని అన్నారు.బంగారు భూమిలో పెట్టుబడి భావితరాలకు అధిక రాబడి అనే విధంగా సరసమైన ధరలతో నాణ్యమైన వ్యాపార ధోరణిలో సొంత ఇంటి గలను నెరవేర్చుకోవాలని వారి సంకల్పం నెరవేరేందుకు బంగారు భూమి డెవలపర్స్ వెంచర్స్ నందు మధ్యతరగతి కుటుంబీకులు సైతం కొనుగోలు చేయగల ఆర్థిక సామర్థ్యానికి తగ్గట్టుగా ప్లాట్లు విక్రయించేందుకు చైర్మన్ రఘురాం తన వంతు సహకారం అందించడం సంతోషకర విషయం అని అన్నారు. ఎంతోమంది నిరుద్యోగులకు అర్హతకు మించి ఉద్యోగం కల్పించి, వారందరికీ ఉపాధి కల్పిస్తున్న బంగారు భూమి డెవలపర్స్ చైర్మన్ రఘురామ్ సామాజిక సేవలు అభినందనీయమని ఆయన సేవలను ప్రశంసించారు.ఈ సందర్భంగా బంగారు భూమి డెవలపర్స్ మార్కెటింగ్ కార్యాలయ సిబ్బందితోపాటు వినియోగదారులు స్నేహితులు మిత్రులు పాల్గొని బాణాసంచా పేల్చి, భారీ కేక్ కటింగ్ చేసి స్వీట్స్ పంచుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ వెంకటేశ్వర్లు , గ్రీన్ హోమ్స్ మేనేజర్ భాస్కర్ గౌడ్ తమ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో సుమారు 300 మంది పాల్గొనగా వందమందికి పైగా రక్త నిలబడి అందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సిబ్బంది భాస్కర్, అరిగల సాయి లతోపాటు రఘు రామ్ మిత్రబృందం చింతల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *