కల్వకుర్తి వాళ్లను నమ్మకండి

సిరా న్యూస్,నారాయణపేట;
నారాయణపేట జిల్లా ముక్తల్ నియోజకవర్గం లో బిజెపి ఎంపీ అభ్యర్థి డీకే అరుణ జోరుగా ప్రచారం చేస్తున్నారు. పలు గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి అరుణ కు ఘన స్వాగతం పలికారు గ్రామస్థులు…., బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా గ్రామస్తులు ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ప్రజా సంక్షేమ పాలనలో మోదీ ప్రపంచానికే ఆదర్శం అని ఇక్కడ గ్రామస్థుల ఆశీస్సుల కోసం ఇక్కడికి వచ్చానని కోరారు. కాంగ్రెస్, బిఆరెస్ కు ఓటు వేస్తే మోరీలో వేసినట్లే నని మీ ప్రాంత ఆడబిడ్డను.. ఆదరిస్తారని ఆశిస్తున్నానుఅన్నారు. ఎక్కడో కల్వకుర్తి నుంచి వచ్చినోళ్లను నమ్మితే మరోసారి మోసపోతారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పారు… ఇచ్చిన ఏ ఒక్క గ్యారంటీ కూడా కాంగ్రెస్ అమలు చేయలేక పోయిందని ఇలానే ప్రజలను మోసం చేసి నోటికొచ్చినట్లు మాట్లాడిన కేసీఆర్ ఎక్కడికి వెళ్ళాడో చూసాం… రేపు రేవంత్ కూ అదే పరిస్థితి వస్తుందని జోష్యం చెప్పారు…మహిళా లకు ఫ్రీ బస్సు ఏమో గాని వారు నరకం అనుభవిస్తున్నారని అన్నారు అసలు ఈ స్కీం ఎవరు అడిగారని నీలదీస్తున్న ప్రజలు. మోదికి రాహుల్ కీ పొంతనే లేదు. ఎవరెన్ని కుట్రలు చేసిన మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయంఅని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *