సిరా న్యూస్,బద్వేలు;
లోన్ ఆప్స్ ద్వారా అప్పు… మీ ప్రాణాలకు ముప్పు
సైబర్ నేరగాళ్లు డబ్బు దోచేస్తే వెంటనే టోల్ నెంబర్ కు ఫోన్ చేయండి
ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారు
బద్వేల్ అర్బన్ సీఐ యుగంధర్
సైబర్ నేరగాళ్ల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలకు గురికారాదని బద్వేలు అర్బన్ సీఐ యుగంధర్ తెలిపారు. ప్రస్తుతము అనేక రకాలుగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడం జరుగుతుందని అవి జిల్లాలో పై స్థాయి అధికారుల ఫోటోలను వాట్సప్ డీపీలుగా మార్చుకొని కిందిస్థాయి ఉద్యోగులను డబ్బులు పంపమని వాట్సప్ మెసేజ్ లు చేయడం జరుగుతుంది. అలాంటి వాటిని ఎవరు నమ్మరాదని పై స్థాయి అధికారులు ఎవరూ డబ్బులు అడగరని తెలిపారు. ఆన్లైన్ లోన్స్ గురించి లోన్స్ యాప్లను మీ ఫోన్ లో డౌన్లోడ్ చేసినప్పుడు మీ ఫోన్లో ఉన్న అన్ని ఫోన్ నెంబర్లు ఫోటోలు మీ వ్యక్తిగత వివరాలు యాప్ వారు మీ అనుమతి లేకుండా తీసుకుంటారు తర్వాత మీరు తీసుకున్న లోన్ తిరిగి కట్టిన ఎక్కువ డబ్బులు కట్టమని ఆ వివరాలతో వేధింపులకు గురి చేస్తారు తస్మాత్ జాగ్రత్త అని ఆన్లైన్ లోన్ ఆప్స్ ద్వారా లోన్స్ తీసుకోరాదని సూచించారు. లోన్ ఆప్స్ వేధింపులకు మీలో మీరే బాధపడవద్దు, క్షణికావేశాలకు పోవద్దు. మీ కుటుంబ సబ్యులకు, స్నేహితులకు చెప్పండి కి లేదా డయల్ 100 కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కస్టమర్ కేర్ నెంబర్ను సంబంధిత వెబ్సైట్ నుండి మాత్రమే తీసుకోవాలి సైబర్ నేరగాళ్లు గూగుల్ నందు నకిలీ కస్టమర్ కేర్ నెంబర్ నుంచి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. పండుగలకు షాపింగ్ చేసే సమయంలో ఇచ్చే లాటరీ కూపన్లలో వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని ఎస్పీ సూచించారు. లాటరీ కూపన్లో నమోదు చేసే ఫోన్ నెంబరు, మెయిల్ ఐడీ వంటి వ్యక్తిగత వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చేరే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎవరైనా ఈ తరహా మోసాల బారినపడితే ఫోన్ చేయాలని అన్నారు. తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ లో కానీ ఇంస్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్లో కానీ వీడియో కాల్ చేసి ఫోటో లను న్యూడ్ ఫోటో లుగా మార్ఫింగ్ చేసి మీ బంధువులకి ఫోన్ చేస్తాము ,ఫోటోలు పంపిస్తాం ,యు ట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం అంటూ ఇబ్బంది పెడుతున్నారు. పార్ట్ టైం జాబ్ ఇస్తామని, లాటరీ వచ్చింది అనో, గిఫ్ట్ వచ్చిందనో, కేవైసి అప్డేట్ చేయాలని చెప్పి సైబర్ నేరగాళ్లు పర్సనల్ డీటెయిల్స్ తీసుకొని డబ్బు కాజేస్తున్నారు. ఆన్లైన్ సైబర్ నేరగాళ్ల మోసాల్లో పడకుండా అప్రమత్తంగా ఉండడం అవశ్యకం అని సీఐ యుగంధర్ తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు.