రైతు ఋణ మాఫీపై అనవసర రాద్ధాంతం వద్దు

-అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అవుతుంది
-కాంగ్రెస్ బిసి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోటికార్ కిషన్ జీ
 సిరా న్యూస్,మంథని;
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నదని,రైతు ఋణ మాఫీపై అనవసర రాద్ధాంతం వద్దని కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోటికార్ కిషన్ జీ అన్నారు. కొన్ని సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని వారికి కూడా రుణమాఫీ చేయడం తథ్యం అన్నారు. టిఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే వీధుల్లో రాస్తారోకో చేస్తున్నారని, ఏ ఒక్క రైతు కూడ రాస్తారోకోలో లేరన్నారు. రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తుందన్నారు. బిఆర్ఎస్ పదేండ్ల కాలంలో రుణమాఫీ ఎంత చేసిందో ఎనిమిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వం అంతకు రెట్టింపు చేసిందన్నారు. ఇది రైతులకు మేలు చేసే ప్రభుత్వం అని, రైతుబంధు పేరుతో గుట్టలకు వందల వేల ఎకరాల భూస్వాములకు దోచిపెట్టిన టిఆర్ఎస్ ప్రభుత్వం కాదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత బిఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. ప్రజలకు స్వేచ్ఛనిచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని,రైతులంతా సంతృప్తిగా ఉంటే వారిని రెచ్చగొట్టే బిఆర్ఎస్ నాయకులకు ఎవరు నమ్మే స్థితిలో లేరన్నారు. మంథని మండలంలో 90 శాతం రైతులకు రుణమాఫీ జరిగిందని తక్కిన వారికి కూడా త్వరలో రుణమాఫీ జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తో పాటు ఇతర మంత్రుల అంతా అనునిత్యం రైతుల కొరకు శ్రమిస్తున్నారన్నారని గోటికార్ కిషన్ జీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *