సిరాన్యూస్, సైదాపూర్:
సైదాపూర్ లో ఘనంగా తెలంగాణ దశాబ్ధి ఉత్సవ వేడుకలు
* జెండాను ఆవిష్కరించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంత సుధాకర్
వెన్కేపల్లి-సైదాపూర్ మండల కేంద్రంలో హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు సైదాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంత సుధాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి అవతరణ దినోత్సవం కావడంతో ఈ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిచడం జరిగింది అన్నారు. ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాలు చూసి చలించిపోయిన సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై కృషి చేసిందని తెలిపారు. ఆమెకి తెలంగాణ ప్రజలు ఎల్లపుడూ రుణపడి ఉంటారని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్త, ప్రజలు పాల్గొన్నారు.