సిరాన్యూస్, సైదాపూర్:
జాబ్ మేళాను యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలి : కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్
హుస్నాబాద్ లో జరిగే మెగా జాబ్ మేళాను యువతీ యువకులు వినియోగించుకోవాలని సైదాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంత సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ యువత ఉపాధి పొంది ఉన్నతంగా ఎదగాలని, ఈనెల 24న హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. సైదాపూర్ మండలంతో పాటు ఇతర మండలాలకు చెందిన యువతీ ,యువకులు ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందాలని కోరారు. మెగా జాబ్ మేళాలో పాల్గొనేవారు గూగుల్ డాక్యుమెంట్స్ లో ,క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అందులో రిజిస్టర్ అవ్వాలని కోరారు.