ఇంటింటికి అయోధ్య శ్రీరామచంద్ర మూర్తి అక్షింతలు

సిరా న్యూస్,తుగ్గలి;
అయోధ్య నందు శ్రీరామచంద్ర మూర్తి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగే లోపు ప్రతి ఇంటికి అయోధ్యలో బాల రాముని వద్ద పూజించిన అక్షింతలను చేర్చుతామని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు.మండల పరిధిలోని గల జొన్నగిరి గ్రామంలో రెండవ రోజు అయోధ్య శ్రీరామచంద్రమూర్తి వారి అక్షంతలను శివాలయం పూజారి విరుపాక్షేశ్వర స్వామి, భజన మండలి గౌరవాధ్యక్షులు తంబళ్ళ ఉమామహేశ్వర్ల ఆధ్వర్యంలో అయోధ్యలో రాముని వద్ద పూజించిన అక్షింతలను గ్రామంలోని ఆర్యవైశ్య వీధి,చెరువు కట్ట కింద వీధి మరియు పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాలలోని గల ప్రతి ఇంటికి అక్షంతలను పంపిణీ చేసినట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉప్పర్లపల్లె సొసైటీ సీఈఓ గిడ్డయ్య,శ్రీ విరుపాక్షేశ్వర స్వామి భజన మండల సభ్యులు, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *