సిరా న్యూస్,విజయనగరం;
విజయనగరం జిల్లా గరివిడి రైల్వే బ్రిడ్జ్ డౌన్లో అనుమానస్పద రీతిలో తీవ్రగాయాలతో పడిఉన్న మామిడి జితేంద్ర(24) చికిత్స పొందుతూ విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందాడు. జితేంద్ర మృతిపై పలు అనుమానాలున్న ఇది రైల్వే పోలీసుకి చెందుతుందని గరివిడి పోలీసులు చెబుతున్నారు. క్షతగాత్రుడ్ని ఆదివారం రాత్రీ 11 గంటల సమయంలో చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రికి కొందరు యువకులు తరలించారు. ఘటన పై లారీ ఢీ కొట్టిందని కొందరు,కొట్టి పట్టాలపై పడేసారని కొందరు భిన్నంగా ప్రభుత్వాసుపత్రిలో సమాచారం ఇవ్వడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నారు.