సిరా న్యూస్,సికింద్రాబాద్;
ఇంట్లోకి చొరబడ్డ దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించిన తల్లీ కూతుళ్ళను నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని సనర్మానించారు.
డీపీసీ మాట్లాడుతూ నిన్న మధ్యాహ్నం పైగా కాలనీలో అటెంప్ట్ రాబరీ జరిగింది. నిందితులు మర్డర్ చేయడానికి ప్రయత్నించారు. 2022 లో దీపావళి టైంలో వీరి ఇంట్లో పని చేయడానికి వచ్చారు. నాలుగు రోజుల పాటు పని చేశారు. రాబరీ చేయడానికి ఇద్దరు నిందితులు ప్లాన్ చేసుకొని వచ్చారు. రెండు రోజుల ముందు రెక్కీ చేశారు. కొరియర్ వచ్చిందని చెప్పి ఇంట్లోకి వచ్చారు. కంట్రీ మేడ్ వెపన్, కత్తి తో బెదిరించారు. నిందితులను పట్టుకోవడానికి తల్లీ కూతుళ్లు ధైర్యసాహసాలు చూపించారు. నా పదకొండేళ్ల సర్వీస్ లో ఇంత ధైర్యసాహసాలు చూపించిన మహిళలను చూడలేదు. ఒక నిందితుడిని ఇక్కడే పట్టుకున్నారు. మరో నిందితుడిని కాజీపేట లో జీఆర్పీ పోలీసులు పట్టుకున్నారు. వెపన్ ఎక్కడి నుండి తెచ్చారు. గతంలో కేసులు ఏమైనా ఉన్నాయా అని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. మహిళలు కూడా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలని అన్నారు.