సిరా న్యూస్, ఖానాపూర్
18 లీటర్ల నాటు సారా పట్టివేత : డీపీఈఓ ఎంఏ రజాక్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఇక్బాల్ పూర్, గోసంపల్లె, బీర్ నంది, కోమ్ముతండా, సత్తనపల్లి, గ్రామాలలో శనివారం నిర్మల్ డీపీఈఓ ఎంఏ రజాక్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. 18 లీటర్ల నాటు సారాను పట్టుకున్నారు. అలాగే 2600 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. ఆరు కేసులు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశారు.ఈ దాడుల్లో ఎన్ఫర్మెంట్ ఎన్ఫోర్సమెంట్ సీఐ ఎండి అక్బర్ హుస్సేన్, నిర్మల్ ఎక్సైజ్ ఎస్ఐ వసంతరావు, డీటీఎఫ్ ఎస్ఐ సింధు, భైంసా ఎస్సై, నిర్మల పాటిల్, సిబ్బంది పాల్గొన్నారు.