DPRO Dasharatham: డిపిఆర్ఓ మామిండ్ల దశరథం బదిలీ…

సిరా న్యూస్, రాజన్న సిరిసిల్ల:

డిపిఆర్ఓ మామిండ్ల దశరథం బదిలీ…

రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం బదిలీ అయ్యారు. హైదరాబాద్ లోని సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ ఆ శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సమాచార శాఖ ప్రధాన కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో కొనసాగుతూనే, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్ డిపిఆర్ఓ గా వ్యవహరించనున్నారు. కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన మామిండ్ల దశరథం డిపిఆర్ఓ గా ఐదున్నర సంవత్సరాల పాటు విశేష సేవలందించారు. గతంలో సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల డిపిఆర్ఓగా చేసిన ఆయన, పలు డాక్యుమెంటరీలు సైతం రూపొందించారు. మీడియాను ఎప్పటి కప్పుడు సమన్వయం చేస్తూ, ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో ఆయన విశేష కృషి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *